ఫుల్‌ పాజిటివ్‌

Geetha Arts acquires distribution rights for Paper Boy - Sakshi

సంతోష్‌ శోభన్, రియా సుమన్‌ జంటగా జయశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. సంపత్‌ నంది కథను అందిస్తూ, రాములు, వెంకట్, నరసింహులతో కలిసి నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ సొంతం చేసుకుంది. అల్లు అరవింద్, ‘బన్నీ’ వాసు, దర్శకుడు మెహర్‌ రమేశ్‌లకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు చిత్రబృందం. ‘‘సినిమా నచ్చిన వెంటనే అల్లు అరవింద్‌గారు రిలీజ్‌ రైట్స్‌ను ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాకు మంచి పాజిటివ్‌ వైబ్‌ ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సౌందర్‌ రాజన్‌.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top