ఆ కథ ముందుగా బన్నీకే చెప్పా! | director srinivas reddy chit chat with sakshi | Sakshi
Sakshi News home page

ఆ కథ ముందుగా బన్నీకే చెప్పా!

Jan 31 2016 12:24 AM | Updated on Sep 3 2017 4:38 PM

ఆ కథ ముందుగా బన్నీకే చెప్పా!

ఆ కథ ముందుగా బన్నీకే చెప్పా!

‘‘‘ఉయ్యాల జంపాల’ చూశాక రాజ్‌తరుణ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ కథ రాసుకున్నా. అతను గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది.

‘‘‘ఉయ్యాల జంపాల’ చూశాక రాజ్‌తరుణ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ కథ రాసుకున్నా. అతను గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది. నేను ఏ  ప్రేక్షకులను టార్గెట్ చేసి తీశానో, వారికి బాగా నచ్చుతోంది’’ అని శ్రీనివాస్ గవిరెడ్డి అన్నారు. తొలి ప్రయత్నంగా శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ ఇటీవల  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు...
చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. చిరంజీవిగారి నటన చూస్తూ పెరిగా. నాన్నేమో సినిమాల్లోకెళితే పనికిరాననీ, అమ్మయితే పైకొస్తా వనీ నమ్మేది. నా ఆకాంక్ష నెరవేర్చుకోడానికి హైదరాబాద్‌లో  అడుగు పెట్టా. శ్రీకాంత్ నటించిన ‘నగరం’కి సహాయ ద ర్శకునిగా చేశాను. బన్నీకి కలిసి కథ చెప్పాలన్న ప్రయత్నంతో నా జీవితం యూటర్న్ తీసుకుంది.

ప్రస్తుతం ఆది హీరోగా రూపొందిన ‘గరం’ కథ ముందు అల్లు అర్జున్‌కే వినిపించాను. ఈ సినిమా చేయకపోయినా బన్నీ నాకు ఆర్థికంగా సహకారం అందించారు. ఆయన దగ్గరే కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేశా. ‘గరం’కి కథ, మాటలు నావే.  భవిష్యత్తులో అల్లు అర్జున్‌తో సినిమా చేసే రోజు వస్తుందన్న నమ్మకముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement