‘ఆచార్య’ అవన్నీ పుకార్లే! | Chiranjeevi Acharya Movie Matinee Entertainment Press Note | Sakshi
Sakshi News home page

‘రామ్‌ చరణ్‌కు మాకు ఎలాంటి విభేదాలు లేవు’

Mar 21 2020 12:29 PM | Updated on Mar 21 2020 12:39 PM

Chiranjeevi Acharya Movie Matinee Entertainment Press Note - Sakshi

ఈనేపథ్యంలో..  చిత్ర నిర్మాత‌లు రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయని ప్ర‌చారం సాగుతోంది.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా స్టార్‌ డైకెర్టర్‌ కొరటాల శివ కాంబినేష‌న్‌లో వస్తున్న చిత్రం ఆచార్య. మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే, క‌రోనా భయాల నేపథ్యంలో సినిమా షూటింగ్‌కి కొద్ది రోజులు విరామం ఇచ్చారు. ఈనేపథ్యంలో..  చిత్ర నిర్మాత‌లు రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయని ప్ర‌చారం సాగుతోంది. దీనిపై మాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌కి, మాకు ఎలాంటి విభేదాలు లేవని, సినిమాకి సంబంధించిన ప్ర‌తి విష‌యంలో క‌లిసి చ‌ర్చిస్తున్నామని ప్రకటనలో తెలిపింది. ‘ఆచార్య సినిమాకు సంబం‍ధించి అన్ని విషయాలపై క‌లిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ అంశమైనా ఇద్ద‌రి అంగీకారంతోనే ఫైనల్‌ అవుతుందని పుకార్ల‌కి ఫుల్‌స్టాప్‌ పెటింది మాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ. కాగా, చిరంజీవికి ఇది 152వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రాఫీ: తిరు. ఎడిట‌ర్: శ్రీక‌ర్ ప్ర‌సాద్, సురేష్ సెల్వ‌రాజ‌న్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement