అభిమానులకు మహేశ్ మరో కానుక | Brahmotsavam first-look motion poster released | Sakshi
Sakshi News home page

అభిమానులకు మహేశ్ మరో కానుక

Apr 28 2016 10:15 AM | Updated on Sep 3 2017 10:58 PM

అభిమానులకు మహేశ్ మరో కానుక

అభిమానులకు మహేశ్ మరో కానుక

'ప్రిన్స్' మహేశ్ బాబు తన అభిమానులకు మరో కానుక ఇచ్చారు.

 ఇక రెండు చక్రాల వాహనాలకు క్రేజ్ తగ్గుతుందా? యూత్ అంతా.. ముఖ్యంగా మహేశ్‌బాబు అభిమానులు మూడు చక్రాల బైక్ మార్కెట్లోకి వస్తే బాగుండు అని కోరుకుంటారా? ఆ ఛాన్సెస్ ఉన్నాయి. మరి.. తమ అభిమాన నాయకుడు తొడుక్కునే చొక్కా నుంచి నడిపే వాహనం వరకూ అన్నింటినీ ఫాలో అవ్వాలనుకుంటారు కదా. అయినా మూడు చక్రాల బైక్ ఏంటి.. వెరైటీగా.
 
 ఆ వెరైటీ ఏంటో ‘బ్రహ్మోత్సవం’లో చూసి తెలుసుకోవాల్సిందే. మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్, సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. అందులో మూడు చక్రాల బుల్లెట్‌పై మహేశ్ దూసుకెళుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ- ‘‘యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది.
 
 మంచి కథ, అత్యున్నత సాంకేతిక విలువలు, భారీ తారాగణంతో నిర్మించాం. మహేశ్‌కి కెరీర్‌కు, మా బ్యానర్‌కి ఒక మైలురాయిగా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా శ్రీకాంత్ అడ్డాల తీర్చిదిద్దారు. మిక్కీ జె.మేయర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మే 7న హైదరాబాద్‌లో విడుదల చేస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ గుణ్ణం.
 

Advertisement
 
Advertisement
Advertisement