టాలీవుడ్‌లోకి బాలీవుడ్ విలన్ | bollywood actor kay kay menon debuts in telugu film | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లోకి బాలీవుడ్ విలన్

Jan 19 2016 9:44 PM | Updated on Aug 11 2019 12:52 PM

సర్కార్, హైదర్, ఏబిసిడి లాంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నమళయాళీ నటుడు కె కె మీనన్ ఘాజీ సినిమాలో నటించనున్నాడు.

సర్కార్, హైదర్, ఏబిసిడి లాంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నమళయాళీ నటుడు కె కె మీనన్ ఘాజీ సినిమాలో నటించనున్నాడు. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో రానా, ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. బాహుబలి 2 కోసం రెడీ అవుతున్న గ్యాప్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తొలి సబ్ మెరైన్ వార్ బేస్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఘాజీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.

రానాతో పాటు ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రకు ప్రకాష్ రాజ్ను ఎంపిక చేశారు చిత్రయూనిట్. అయితే ప్రకాష్ రాజ్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మన ఊరి రామాయణం సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటుడు కె కె మీనన్ ని ఎంపిక చేశారు. తాప్సీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పివిపి బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement