భానుచందర్ కొడుకు బంగారం | Bhanu Chander to direct his son Jayanth in 'Naa Koduku Bangaram' | Sakshi
Sakshi News home page

భానుచందర్ కొడుకు బంగారం

Sep 24 2013 2:19 AM | Updated on Aug 28 2018 4:30 PM

భానుచందర్ కొడుకు బంగారం - Sakshi

భానుచందర్ కొడుకు బంగారం

తన తనయుడు జయంత్ కథానాయకునిగా, తన మిత్రుడు బూచితో కలిసి భానుచందర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘నా కొడుకు బంగారం’. భానుచందరే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా. నట్టం సుబ్బారావు నిర్మాత.

తన తనయుడు జయంత్ కథానాయకునిగా, తన మిత్రుడు బూచితో కలిసి భానుచందర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘నా కొడుకు బంగారం’. భానుచందరే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా. నట్టం సుబ్బారావు నిర్మాత. 
 
 వచ్చే నెలలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రం గురించి భానుచందర్ మాట్లాడుతూ- ‘‘టైటిల్‌కి తగ్గట్టుగా కథ ఉంటుంది. థ్రిల్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ కలగలిసిన కథ ఇది. నా చిరకాల మిత్రుడు బూచితో కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. 
 
 అక్టోబర్ చివరివారంలో ఈ చిత్రం సెట్స్‌కి వెళుతుంది’’ అని తెలిపారు. సుమన్, సుహాసినీ మణిరత్నం, బ్రహ్మానందం, నాజర్, సీత, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, ముఖేష్‌రుషి తదితరులు ఇందులో ఇతర పాత్రలు పోషించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement