అమెరికాలో సైలెంట్‌గా... | Anushka Silence starts in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో సైలెంట్‌గా...

May 26 2019 1:41 AM | Updated on May 26 2019 1:41 AM

Anushka Silence starts in America - Sakshi

అనుష్క

‘బాహుబలి’ తర్వాత అనుష్క నెక్ట్స్‌ సినిమా పట్ల చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఏ సినిమా చేస్తున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ‘సైలెంట్‌’ అనే బహుభాషా చిత్రం అంగీకరించారు. మాధవన్, అనుష్క జంటగా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’.  అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్‌ స్టార్‌ మైఖేల్‌ మ్యాడిసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అమెరికాలోని సీటెల్‌ ప్రాంతంలో ప్రారంభమైంది. చాలా శాతం షూటింగ్‌ అక్కడే జరుపుకోనుంది. సైలెంట్‌ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్‌ యాక్టర్స్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్‌ షానీ డియోల్‌ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement