ఆ నిమిషం.. మంచి సందేశం

Actress Jayasudha Launches Aa Nimisham Movie Teaser - Sakshi

‘‘సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపండి, ఆడపిల్లలను కాపాడండి’’ వంటి మంచి మెసేజ్‌ ఉన్న చిత్రాన్ని తీసిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే మరికొన్ని మంచి సినిమాలు తీయటానికి దర్శక–నిర్మాతలు ముందుకు వస్తారు. ఈ సినిమా మంచి సక్సెస్‌ సాధిస్తుంది’’ అన్నారు నటి జయసుధ.

వెంకటేశ్వర మూవీ ఫ్యాక్టరీ బ్యానర్‌ పై కాలా రాజేశ్‌ దర్శకత్వంలో కె. ప్రసాద్‌ రెడ్డి నటించి, నిర్మించిన చిత్రం ‘ఆ నిమిషం’. ఈ చిత్రం టీజర్‌ను నటి జయసుధ రిలీజ్‌ చేశారు. ‘‘మా టీజర్‌ను జయసుధగారు విడుదల చేయటం ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం. నిర్మాతకు కృతజ్ఞతలు’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: కున్నీ గుడిపాటి, కెమెరామేన్‌: యోగి ప్రసాద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top