'కేరింత' బృందంపై కోడిగుడ్ల దాడి | abvp students throws eggs on kerintha unit in srikalulam | Sakshi
Sakshi News home page

'కేరింత' బృందంపై కోడిగుడ్ల దాడి

Jun 24 2015 8:05 PM | Updated on Sep 2 2018 4:52 PM

'కేరింత' బృందంపై కోడిగుడ్ల దాడి - Sakshi

'కేరింత' బృందంపై కోడిగుడ్ల దాడి

విజయ యాత్ర చేస్తున్న 'కేరింత' చిత్ర బృందానికి శ్రీకాకుళంలో చేదుఅనుభవం ఎదురైంది.

శ్రీకాకుళం: విజయ యాత్ర చేస్తున్న 'కేరింత' చిత్ర బృందానికి శ్రీకాకుళంలో చేదుఅనుభవం ఎదురైంది. శ్రీకాకుళం భాష, యాసను కించపరిచారనే ఆగ్రహంతో చిత్రబృందానికి వ్యతిరేకంగా స్థానిక ధియేటర్ వద్ద ఏబీపీవీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిర్మాత దిల్ రాజు, హీరో సుమంత్ అశ్విన్ కార్లపై కోడిగుడ్లు విసిరారు.

తమ ప్రాంత భాష, యాసను కించపరిస్తే సహించబోమని విద్యార్థులు హెచ్చరించారు. దిల్ రాజు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 'కేరింత' సినిమాలో సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ముఖ్యతారలు. అడివి సాయికిరణ్ దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement