ఓ ప్రేమ కబురు ప్రాణం తీసింది! | Woman dies while celebrating marriage proposal | Sakshi
Sakshi News home page

ఓ ప్రేమ కబురు ప్రాణం తీసింది!

Jan 30 2015 3:16 PM | Updated on Apr 3 2019 8:07 PM

ఓ ప్రేమ కబురు ప్రాణం తీసింది! - Sakshi

ఓ ప్రేమ కబురు ప్రాణం తీసింది!

ఓ తీయని ప్రియుని ప్రేమ కబురు ప్రియురాలి ప్రాణాలను తీసింది. పెళ్లి చేసుకుంటాననే ప్రియుడి తీపి వార్త కాస్తా ఓ యువతికి శాపంగా మారిన ఘటన లండన్ చోటు చేసుకుంది.

లండన్: ఓ తీయని ప్రియుని ప్రేమ కబురు ప్రియురాలి ప్రాణాలను తీసింది.  పెళ్లి చేసుకుంటాననే ప్రియుడి తీపి వార్త కాస్తా ఓ యువతికి శాపంగా  మారింది. లండన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బల్గేరియాకు చెందిన దిమిత్రినా దిమిత్రోవా(29) ఓ యువకునితో ప్రేమలో పడింది. ఆ క్రమంలో గత కొంతకాలంగా వారు ప్రేమలో విహరిస్తున్నారు. ఇక పెళ్లి సమయం వచ్చేసిందని భావించిన ఆ ప్రియుడు పెళ్లి ప్రస్తావనను ప్రియురాలి చెంతకు చేరవేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిని ఆహ్వానించాడు.

 

ఇద్దరు కలిసి ఏకాంతంగా ఉన్న ఒక కొండపై కలిశారు. కాసేపు ప్రేమ కబుర్లు చెప్పుకున్న అనంతరం తన మనసులో మాటను చెప్పాడు ఆ యువకుడు.'నిన్ను నేను త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు సిద్ధమేనా'అని ఆ యువకుడు ప్రియురాలికి తన మనసులో విషయాన్ని చెప్పాడు. దీంతో ఆ యువతి ఆనందంతో ఎగిరి గంతులేస్తూ ఊహల్లో తేలియాడింది. ఇక అది కొండ కావడంతో అదుపు తప్పి కిందకు జారింది.ఆ కొండ 60 ఏడుగులు ఎత్తు కావడంతో  ఆమె తీవ్రంగా గాయపడటమే కాకుండా గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement