ఇరాన్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు శుక్రవారం పోలింగ్ జరిగింది.
టెహ్రాన్: ఇరాన్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆర్థిక, దౌత్య విధానాలపై ఈ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్నారు. ఇస్లాం అతివాది ఇబ్రహీం రైసీ(56) నుంచి రౌహానీకి గట్టి పోటీ ఎదురవుతోంది. దేశమంతా ఓటేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. దీంతో పోలింగ్ గడువును రెండు గంటలు పొడిగించారు.
ఇరాన్ సుప్రీం నాయకుడిగా పరిగణించే అయాతుల్లా అలీ ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పౌర స్వేచ్ఛ, అతి వాదుల మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలని రౌహానీ ప్రజలకు పిలుపిచ్చారు. రౌహానీ దౌత్య విధానాలు విఫలమవడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని రైసీ విమర్శించారు. అమెరికా–ఇరాన్ సంబంధాల్లో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నందునా వీటికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది.