బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి | The death toll from a coal mine blast in China's Mongolia region has risen to 32. | Sakshi
Sakshi News home page

బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి

Dec 4 2016 11:50 AM | Updated on Apr 3 2019 3:52 PM

బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి - Sakshi

బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి

బొగ్గుగనిలో జరిగిన భారీ పేలుడులో 32 మంది మృతి చెందారు

బీజింగ్‌: చైనాలోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. చిఫెంగ్‌ పట్టణంలోని బౌమా మైనింగ్‌ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో 181 మంది అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తుండగా.. వారిలో 149 మంది ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడినట్లు జిన్హువా వెల్లడించింది.

పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. కాగా.. ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. పోలీసులు, మెడికల్‌ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆదివారం సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement