తొక్కిసలాట.. 50 మంది మృతి | Stampede during protest at religious festival in Ethiopia, opposition says 50 dead | Sakshi
Sakshi News home page

తొక్కిసలాట.. 50 మంది మృతి

Oct 3 2016 10:13 AM | Updated on Sep 4 2017 4:02 PM

తొక్కిసలాట.. 50 మంది మృతి

తొక్కిసలాట.. 50 మంది మృతి

ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో జరిగిన తొక్కిసలాటలో సుమారు 50 మంది మృతిచెందారు.

అడిస్ అబాబా: ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో జరిగిన తొక్కిసలాటలో సుమారు 50 మంది మృతిచెందిన ఘటన ఇథియోపియాలో చోటుచేసుకుంది. ఒరోమియా ప్రాంతంలో మతపరమైన కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఓ వర్గానికి చెందిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ.. తిరుగుబాటుదారులకు సంబంధించిన జండాను ఎగురవేశారు. దీంతో వారిని చదరగొట్టే క్రమంలో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో 50 మంది పౌరులు మృతి చెందారని అక్కడి ప్రతిపక్ష పార్టీ వెల్లడించింది. అయితే ప్రభుత్వం మాత్రం మృతుల సంఖ్యను ధృవీకరించనప్పటికీ.. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement