భారత్‌పై గూఢచర్యం.. పాక్‌ భారీ స్కెచ్‌ | Pakistan Major Space Plan for Spying on India | Sakshi
Sakshi News home page

Apr 30 2018 11:40 AM | Updated on Apr 30 2018 2:39 PM

Pakistan Major Space Plan for Spying on India - Sakshi

ఇస్లామాబాద్‌: భారతదేశంపై గూఢాచర్యానికి పాకిస్థాన్‌ భారీ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. సుమారు 4.7 బిలియన్‌ రూపాయల ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమైంది. వచ్చే ఏడాదికల్లా వాటి నిర్మాణం పూర్తి చేసి ప్రయోగించాలని పాక్‌ నిఘా వ్యవస్థ నిర్ణయించింది. ఈ మేరకు పాక్‌ రక్షణ నిపుణుడు మరియా సుల్తాన్‌ ఇంటర్వ్యూను డాన్‌ పత్రిక ప్రచురించింది. 

‘భారత కదిలికలపై పాక్‌ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంత కాలం ఇండియా పరిమిత పరిధిలో ప్రయోగాలు చేసుకునేంది. కానీ ఈ మధ్య అమెరికా సహకారంతో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఈ సమయంలో పాక్‌ త్వరపడాల్సిన అవసరం ఉంది. విదేశీ శాటిలైట్లపై ఎంతో కాలం ఆధారపడలేం. అందుకే ఈ భారీ ప్రయోగానికి పాక్‌ రక్షణ రంగం సిద్ధమైంది’ అని మరియా పేర్కొన్నారు. దేశీయ సూపర్‌కో ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు.

పాక్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం తొలిదశలో రూ. 100 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా కేటాయింపులు ఉంటాయని తెలిపింది. ఈ మెగా ప్రాజెక్టులో మొత్తం నాలుగు శాటిలైట్లను రూపకల్పన చేయనున్నారు. అందులో పాక్‌ శాట్‌-ఎంఎం1 ఒక్కదాని కోసమే రూ. 135 కోట్లను కేటాయించగా... మిగతా మూడు శాటిలైట్ల కోసం రూ.255 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇదిగాక సుమారు రూ. 100 కోట్లతో కరాచీ, ఇస్లామాబాద్‌, లాహోర్‌లలో స్పేస్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement