విమానం కుప్పకూలి 9 మంది మృతి | Nine People Of Eastern Idaho Dead In Plane At South Dakota | Sakshi
Sakshi News home page

విమానం కుప్పకూలి 9 మంది మృతి

Dec 1 2019 10:17 AM | Updated on Dec 1 2019 8:36 PM

Nine People Of Eastern Idaho Dead In Plane At South Dakota - Sakshi

ఫైల్ ఫోటో

న్యూయార్క్‌: అమెరికాలోని ఛాంబర్‌ లైన్‌లో దక్షిణ డకోటాకు చెందిన ఓ విమానం శనివారం మధ్యాహ్నం కుప్పకూలిపోంది. ఈ ప్రమాదంలో తూర్పు ఇడాహోకు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో  పైలట్‌తోపాటు, ఇద్దరు చిన్న పిల్లలు కూడా  ఉన్నారని బ్రూల్ కౌంటీ రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. ప్రాణాలతో బయటపడి, తీవ్రమైన గాయాలపాలైన వారిని చికిత్స కోసం సియోక్స్ ఫాల్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. 

పీలాటస్ పీసీ -12 విమానం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరింది. ఈ విమానం ఛాంబర్‌లైన్ మునిసిపల్ విమానాశ్రయం నుంచి ఇడాహోకు బయలుదేరింది. కాగా, ఛాంబర్‌లైన్‌కు దక్షిణంగా ఉన్న కార్న్‌ఫీల్డ్‌లో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చూస్తున్నామని రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. తీవ్రమైన వాతావారణ పరిస్థితుల్లో బాధితులను రక్షించడానికి ముందుకు వచ్చిన అందరిని, వైద్యనిపుణులను మౌల్‌ ప్రశంసించారు.  ఈ విమానంలో ఇడాహో చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు వారి కుటుంబ సభ్యులతో ప్రయణించినట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇది రెండో అతిపెద్ద విమాన ప్రమాదంగా తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement