‘ఒంటరి’గా ఎవరెస్ట్‌ ఎక్కలేరు!

Nepal bans solo climbers from Mount Everest under new rules - Sakshi

కఠ్మాండు: ఒంటరి పర్వతారోహకులపై నేపాల్‌ నిషేధం విధించింది. ఎవరెస్ట్‌ పర్వతం సహా నేపాల్‌లోని ఇతర పర్వతాల అధిరోహణకు ఒంటరి వ్యక్తులను నేపాల్‌ ఇకపై అనుమతించరు. ఈ మేరకు నేపాల్‌ కేబినెట్‌ పర్వతారోహణ నిబంధనల సవరణకు శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రమాదాల నివారణ, సురక్షిత పర్వతారోహణకే ఈ చర్య తీసుకున్నట్లు నేపాల్‌ పర్యాటక కార్యదర్శి మహేశ్వర్‌ చెప్పారు. అంధులు, రెండు కాళ్లు పనిచేయని వారు పర్వతారోహణలో పాల్గొనకుండా నిషేధం విధించారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top