మోదీకి చైనా అధ్యక్షుడి కితాబు | Modi raises black money, tax evasion at G20 | Sakshi
Sakshi News home page

మోదీకి చైనా అధ్యక్షుడి కితాబు

Sep 5 2016 11:28 AM | Updated on Apr 3 2019 5:16 PM

మోదీకి చైనా అధ్యక్షుడి కితాబు - Sakshi

మోదీకి చైనా అధ్యక్షుడి కితాబు

జీ20 సదస్సులో నల్లధనం, పన్నుల ఎగవేత అంశాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధానంగా ప్రస్తావించారు.

హాంగ్జౌ: నల్లధనం, పన్నుల ఎగవేత అంశాలను చైనాలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధానంగా ప్రస్తావించారు. సోమవారం రెండో రోజు సదస్సులో పాల్గొన్న మోదీ.. ఆర్థిక నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సభ్యదేశాలను కోరారు. అవినీతి, నల్లధనం, పన్నుల ఎగవేతపై తగిన చర్యలు తీసుకున్నప్పుడే ఆర్థిక పరిపాలన ప్రభావవంతంగా సాగుతుందని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక నేరాలపై పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేయాలని సభ్యదేశాలకు విజ్ఞప్తి చేశారు.

సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. భారత ఆర్థిక విధానాల్లో మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ముఖ్యంగా మోదీ ఎనర్జీ పాలసీని జిన్‌పింగ్ మెచ్చుకున్నారు. అంతకు ముందు బ్రిటన్ ప్రధాని థెరిసా మే ను మోదీ కలిశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement