బీజింగ్: సృష్టికి ప్రతిసృష్టి చేసే వైద్యులు దేవుడితో సమానమంటారు. ఒక ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కార్మికుడి చేతిని వైద్యులు రక్షించి ఈ మాటను మరోసారి రుజువు చేశారు. చైనాలోని జో అనే కార్మికుడు విధి నిర్వహణలో ఉండగా ప్రమాదానికి లోనయ్యాడు. అతడి ఎడమ చేయి మిషన్లో పడి తెగిపడింది. అతికించడానికి వీల్లేకుండా చర్మం అంతా పిప్పి పిప్పి అయిపోయింది. దీంతో ఆ భాగంలోని నరాలు, టిష్యూలను రక్షించడానికి జోకు శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు పూనుకున్నారు . మైక్రో బయాలజీ విభాగం అధిపతి డా.టాంగ్ జుయు నేతృత్వంలో ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు.
వివరాల్లోకి వెడితే ...చైనాలోని ఒక ఫ్యాక్టరిలో స్పిన్నింగ్ బ్లేడ్ మిషన్లో పడి జో ఎడమ చేయి మణికట్టు పై భాగమంతా పూర్తిగా నలిగి పోయింది. గాయాల నుంచి అతను కోలుకునే దాకా తెగిపడిన అవయవభాగాన్ని అతని కుడికాలుకి జత చేసి ఆ భాగాన్ని సజీవంగా నిలపగలిగారు. ఒకనెల తర్వాత దాదాపు 10 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు విజయవంతంగా జో చేతిని అతికించారు. అతడు ఇప్పుడిప్పుడే చేతివేళ్లను మెల్లిగా కదిలిస్తున్నాడని, పూర్తిగా స్వాధీనంలోకి రావడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.
ఈ సందర్భంగా వైద్యులు శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కార్మికుడి ఎడమ చేయి వేళ్లు, మిగిలిన కణాలకు రక్త ప్రసరణ జరిగి అది సజీవంగా ఉండేందుకే ఈనిర్ణయం తీసుకున్నామని డాక్లర్లు తెలిపారు. సాధారణంగా తెగిపడిన వేళ్లు, చేయి తదితర భాగాలకు సుమారు పది గంటల్లోపు తిరిగి రక్త ప్రసరణను పునరుద్ధరించాల్సిం ఉంటుందని పేర్కొన్నారు. అయితే జో కోలుకునేసరికి సమయం పడుతుందనీ, అందుకే మిగిలిన భాగాన్ని ఇలా కాపాడాల్సి వచ్చిందని తెలిపారు. మరోవైపు ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ ద్వారా రూపొందించిన పుర్రెను అమర్చి చైనా వైద్యులు చరిత్ర సృష్టించారు.
తెగిన ఎడమ చేతిని కుడికాలికి కుట్టి...
Published Sat, Jul 18 2015 2:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement