చిత్రహింసలు పెట్టి తల్లిని చంపాడు | Indian Woman Allegedly Tortured And Starved To Death By Son In dubai | Sakshi
Sakshi News home page

చిత్రహింసలు పెట్టి తల్లిని చంపాడు

Jun 20 2019 4:16 AM | Updated on Jun 20 2019 4:16 AM

Indian Woman Allegedly Tortured And Starved To Death By Son In dubai - Sakshi

దుబాయ్‌: భార్యతో కలసి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి తన సొంత తల్లినే చిత్రహింసలు పెట్టి చావుకు కారణమైన ఘటన దుబాయ్‌లో జరిగింది. చనిపోయేనాటికి తల్లి బరువు కేవలం 29 కేజీలు అని వైద్యులు వెల్లడించారు. తిండిపెట్టకుండా కడుపు మాడ్చి, శారీరకంగా హింసించడంతో ఆమె పక్కటెముకలు విరగడంతో అంతర్గత రక్తస్రావంతో ఆమె మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. ఆమె కంటి రెటీనాను పెరికివేయడంతో పాటు మరో కంటికి కూడా గాయం చేసినట్లు కోర్టు తెలిపిందని బుధవారం ఖలీజ్‌ టైమ్స్‌ పేర్కొంది. 2018 జూలై నుంచి అక్టోబర్‌ వరకూ ఈ హింస కొనసాగినట్లుగా అల్‌ ఖుసైస్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement