ఎంపీలే లక్ష్యం.. బాంబుతో దద్దరిల్లిన హోటల్‌ | Gunmen launch car bomb attack on Somali hotel | Sakshi
Sakshi News home page

ఎంపీలే లక్ష్యం.. బాంబుతో దద్దరిల్లిన హోటల్‌

Jan 25 2017 5:11 PM | Updated on Aug 14 2018 3:22 PM

పార్లమెంటు సభ్యులే లక్ష్యంగా సోమాలిలో ఓ హోటల్‌ కారు బాంబు దాడితో దద్ధరిల్లింది.

మోగాదిషు: పార్లమెంటు సభ్యులే లక్ష్యంగా సోమాలిలో ఓ హోటల్‌ కారు బాంబు దాడితో దద్ధరిల్లింది. భారీ ఆయుధాలతో దయాహ్‌ అనే హోటల్‌ వద్దకు వచ్చిన దుండగులు తొలుత కాల్పులు జరిపి అనంతరం కారు నిండా బాంబులు పెట్టి అందరూ చూస్తుండగానే పేల్చేశారు. ఈ దాడిలో 10మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా.. 50మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడే గస్తీ కాస్తున్న పోలీసులు సైతం వారు చేస్తున్న చర్యను నివారించలేకపోయారు. అయితే, పార్లమెంటు సభ్యులకు ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది.

ఈ ఘటనపై సొమాలి రక్షణశాఖ మంత్రి అబ్దరిజక్‌ ఒమర్‌ మహ్మద్‌ మాట్లాడుతూ నలుగురు దుండగులను పోలీసులు హతమార్చినట్లు చెప్పారు. ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌కు చెందిన అల్‌ షహాబ్ ఈ దాడికి తెగబడినట్లు భావిస్తున్నామన్నారు. తమ దేశ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నిర్వహించే పరోక్ష ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను పార్లమెంటు సభ్యులు అదే ప్రాంతంలో ఉండి చర్చించుకుంటున్నారని తెలిసిన దుండగులు అదే మార్గంలో కారులో వెళుతూ ఓ హోటల్‌ వద్దకు రాగానే ఆ కారును పేల్చేశారని, దాని తర్వాత మరో కారు పేలుడు చోటు చేసుకుందని చెప్పారు. క్షతగాత్రులకు సత్వర సహాయం అందిస్తున్నామని, కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంత చిద్రమయ్యాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement