విమానంపై పక్షుల దాడి.. సైతాన్‌ పనే.. | Flight Attacked on Air by Birds | Sakshi
Sakshi News home page

విమానంపై పక్షుల దాడి.. సైతాన్‌ పనే..

Nov 21 2017 3:57 PM | Updated on Oct 2 2018 8:04 PM

Flight Attacked on Air by Birds - Sakshi

కొన్ని సంఘటనలు అనుకోని విధంగా మనుషులను ఆశ్చర్యానికి, భయానికి గురిచేస్తాయి. ఇది నిజంగా జరుగుతుందా అని అనిపించేలా ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటనే చైనాలో జరిగింది. అనుకోని విధంగా కొన్ని వందల పక్షులు ఏకంగా విమానంపైనే దాడికి దిగాయి. తప్పని సరి పరిస్థితుల్లో విమానాన్ని లాండ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న విషయం ఏంటంటే బ్రిటీస్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఆ విమానంలో  క్రైస్తవులు ప్రయాణిస్తున్నారని సమాచారం. విమానం గాల్లో ఉండగా పెద్దఎత్తున పక్షులు ఒకేసారి దాడిచేశాయి. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఫైలట్‌ విమానాన్ని సమీపంలోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. దానికి సంభందించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అ‍య్యాయి. 

దాడి తర్వాత అందులో​ ప్రయాణిస్తున్న క్రైస్తవులు, ఫాస్టర్‌ మాట్లాడుతూ ఈదాడి సైతాన్‌ పనేని ప్రకటించారు. సైతాన్‌ పక్షుల రూపంలో దాడి చేసిందని, విమానాన్ని గాల్లోనే కూల్చడానికి ప్రత్నించిందని, రాబోయే ప్రపంచ అంతానికి ఇది సూచిక అని అన్నారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement