త్వరలో ఎలక్ట్రానిక్‌ ద్రావణాలు | 'Drinkable' electronic sensors may help monitor diseases | Sakshi
Sakshi News home page

త్వరలో ఎలక్ట్రానిక్‌ ద్రావణాలు

Jun 25 2018 2:45 AM | Updated on Jul 11 2019 6:28 PM

'Drinkable' electronic sensors may help monitor diseases  - Sakshi

లండన్‌: వ్యాధి నిర్ధారణకు త్వరలోనే ఓ వినూత్నమైన విధానం అందుబాటులోకి రానుంది. బ్యాక్టీరియా రూపంలో ఉండే చిన్న చిన్న ఎలక్ట్రానిక్‌ సెన్సర్లు కలిగిన ద్రావణాన్ని తాగడం ద్వారా అనారోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్‌ సెన్సర్లు పరిమాణంలో ఎర్ర రక్త కణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్, ఫ్రాన్స్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌కు చెందిన పరిశోధకులు దీన్ని తయారు చేశారు ఇది అందుబాటులోకి వస్తే కేన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణా పద్ధతులు సులువవుతాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement