జంట బాంబు పేలుళ్లలో 44 మంది మృతి | Bombings kill at least 31 in northeast Syria city, state TV says | Sakshi
Sakshi News home page

జంట బాంబు పేలుళ్లలో 44 మంది మృతి

Jul 27 2016 3:14 PM | Updated on Sep 4 2017 6:35 AM

జంట బాంబు పేలుళ్లలో 44 మంది మృతి

జంట బాంబు పేలుళ్లలో 44 మంది మృతి

సిరియాలో ఈశాన్యప్రాంతంలో టర్కీ సరిహద్దులో ఉన్న ఖమిష్లి నగరంలో బుధవారం సంభవించిన జంట బాంబు పేలుళ్లలో కనీసం 44 మంది మరణించగా, మరో 170 మంది తీవ్రంగా గాయపడ్డారు

సిరియాలో ఈశాన్యప్రాంతంలో టర్కీ సరిహద్దులో ఉన్న ఖమిష్లి నగరంలో బుధవారం సంభవించిన జంట బాంబు పేలుళ్లలో కనీసం 44 మంది మరణించగా, మరో 170 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించారు. ఖుర్దిష్ భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు వెల్లడించారు.

ఖుర్దిష్ అడ్మినిస్ట్రేషన్ సెక్యురిటీ హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఓ బాంబు పేలింది. ఓ కారు బాంబు, మరో మోటార్ బైక్ బాంబు పేలినట్టు ఈ దేశ మీడియా వెల్లడించింది. భారీ ప్రాణనష్టం జరగడంతో పాటు ఆ ప్రాంతంలో భవనాలకు భారీ నష్టం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement