మరోసారి రక్తమోడిన అఫ్గాన్‌ | Bomb Blast In Afghanistan 7 Killed | Sakshi
Sakshi News home page

మరోసారి రక్తమోడిన ఆఫ్గాన్‌

Oct 2 2018 4:35 PM | Updated on Mar 28 2019 6:10 PM

Bomb Blast In Afghanistan 7 Killed - Sakshi

జలాలాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ ప్రమాదం జరిగింది...

కాబుల్‌ : ఆత్మాహూతి దాడులతో అఫ్గానిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. మంగళవారం కాబుల్‌ సమీపంలోని జలాలాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. జలాలాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఆఫ్గానిస్తాన్‌లో అక్టోబర్‌ 20న దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌, జిల్లా కౌన్సిల్స్‌కు ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రచారంలో భాగంగా ప్రజలు గుమ్మిగూడి ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆఫ్గాన్‌లోని 33 ప్రావిన్స్‌లకు, 249 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. వీటి కోసం పోటీలో 2691 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలో ఆఫ్గాన్‌లో ఉగ్రవాదులు ప్రజా ప్రతినిధులను, అధికారులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సహా, అధికారులతో కలుపుని 50 మంది మృతి చెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement