లండన్ మెట్రో రైలులో పేలుడు
సాక్షి, లండన్: అండర్ గ్రౌండ్ మెట్రో రైల్లో పేలుడుతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం ఉదయం పశ్చిమ లండన్ పార్సన్స్ గ్రీన్ స్టేషన్ వద్ద ఘటన చోటుచేసుకుంది.
ట్యాబ్ ట్రెయిన్లో గుర్తు తెలియని వ్యక్తి వదిలిన బ్యాగ్ పేలిపోవటంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో తొక్కిసలాట చోటుచేసుకోగా, పలువురు ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. స్టేషన్ వద్దకు చేరిన సహయక సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఆ మార్గంలో రైళ్లను తాత్కాలికంగా నిలిపి వేశారు.
పుకార్లు వ్యాపించకుండా సోషల్ మీడియా సర్వీస్ ట్విట్టర్ను నిలుపు చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు