పాక్‌ ట్రోల్స్‌కు అద్నాన్‌ సమీ ధీటైన కౌంటర్‌..! | Adnan Sami Counters Pak Trolls Over Surgical Strikes On Jaishe | Sakshi
Sakshi News home page

పాక్‌ ట్రోల్స్‌కు అద్నాన్‌ సమీ ధీటైన కౌంటర్‌..!

Feb 28 2019 1:44 PM | Updated on Feb 28 2019 2:21 PM

Adnan Sami Counters Pak Trolls Over Surgical Strikes On Jaishe - Sakshi

పాకిస్తాన్‌లో పుట్టి భారత్‌కు జై కొడతావా అంటూ పలువురు..

ముంబై : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన నేపథ్యంలో ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో పుట్టిన అద్నాన్‌ కొన్నాళ్ల క్రితం భారత పౌరసత్వం పొందిన సంగతి తెలిసిందే. ‘భారత వైమానిక దళం పట్ల గర్వంగా ఉంది. హౌ ఈజ్‌ ద జోష్‌. ఉగ్రవాదాన్ని నిర్మూలించండి. జై హింద్‌’ అని ట్వీట్‌ చేశాడు. అద్నాన్‌ కామెంట్లపై పాక్‌ నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. (భారత్‌-పాక్‌ టెన్షన్‌: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు)

పాకిస్తాన్‌లో పుట్టి భారత్‌కు జై కొడతావా అంటూ పలువురు ట్రోల్‌ చేశారు. వారికి అద్నాన్‌ దీటైన సమాధానం ఇచ్చారు. ‘డియర్‌ పాక్‌ ట్రోల్స్‌.. ఇక్కడ ఇగో విషయం కాదు. నిజాన్ని గ్రహించండి. మీరూ, మేము శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేయడం ఇక్కడ ముఖ్య విషయం. మీ నీచమైన మెంటాలిటీ చూస్తుంటే నవ్వోస్తోంది. మరీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. లోపల ఒకటి పెట్టుకుని బయటకి మరొకటి మాట్లాడుతున్నారు. ఉష్ణపక్షిలాగా నిజాలను ఒప్పుకోరు. మీ అంత చండాలమైన మనస్తత్వం ఎవరికీ ఉండదు’ అని గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement