Sakshi News home page

మోదీ ‘స్వచ్ఛ భారత్’కు ఆమిర్ ప్రశంసలు

Published Sun, Nov 9 2014 3:25 AM

మోదీ ‘స్వచ్ఛ భారత్’కు ఆమిర్ ప్రశంసలు - Sakshi

నోయిడా: దేశవ్యాప్త పారిశద్ధ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ‘స్వచ్ఛ భారత్’ గొప్ప కార్యక్రమమని, కేవలం సెలెబ్రిటీలే కాక, ప్రతి పౌరుడూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఆయన సూచించారు. గతనెలలో జరిగిన ‘స్వచ్ఛ భారత్’ ప్రారంభ కార్యక్రమంలో ఆమిర్ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతను అందరూ అలవాటుగా మార్చుకోవాలని, ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.
 

Advertisement
Advertisement