భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది.
కోల్కతా: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది.
బంగ్లాదేశ్లో చిట్టాగాంగ్కు ఈశాన్య ప్రాంతంలో 27 కిలో మీటర్ల దూరంలో 10 కిలో మీట్లర లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.