ఆ విమానం నుంచి 38 మృతదేహాలు వెలికితీత | 38 bodies found at Indonesian plane crash site: official Jayapura | Sakshi
Sakshi News home page

ఆ విమానం నుంచి 38 మృతదేహాలు వెలికితీత

Aug 18 2015 9:43 AM | Updated on Sep 3 2017 7:40 AM

ఆ విమానం నుంచి 38 మృతదేహాలు వెలికితీత

ఆ విమానం నుంచి 38 మృతదేహాలు వెలికితీత

ఇండోనేసియా విమానం కుప్పకూలిన ప్రదేశంలో 38 మృతదేహాలను కనుగొన్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు.

జకర్తా :  ఇండోనేసియా విమానం కుప్పకూలిన ప్రదేశంలో 38 మృతదేహాలను కనుగొన్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఓ చిన్నారి మృతదేహం కూడా ఉన్నట్లు వివరించారు. అక్కడ వాతావరణ పరిస్థితులు సహకరించక పోవడం వల్ల మృతదేహాలను ఇప్పుడే తరలించలేక పోతున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి జేఏ బరాటా మీడియాకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయలుదేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 అనే విమానం పుపువా ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement