భవనంపై నుంచి పడి ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన నగరంలోని అమీర్పేట్లో గురువారం చోటు చేసుకుంది.
భవనంపై నుంచి పడి యువతి మృతి
Mar 10 2016 11:15 AM | Updated on Sep 3 2017 7:26 PM
హైదరాబాద్: భవనంపై నుంచి పడి ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన నగరంలోని అమీర్పేట్లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. విజయా డయాగ్నసిస్లో టెక్నిషియన్గా పని చేస్తోన్న అరుణ అనే యువతి భవనం పై నుంచి పడి మృతి చెందింది. ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పై నుంచి జారిపడిందా లేక ఆత్మహత్య చేసుకుందా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కేరళకు వాసిగా గుర్తించారు.
Advertisement
Advertisement