వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్‌ ప్లానే | vikram goud shooting case mystery reveals | Sakshi
Sakshi News home page

వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్‌ ప్లానే

Aug 1 2017 9:35 PM | Updated on Sep 17 2017 5:03 PM

వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్‌ ప్లానే

వీడిన మిస్టరీ.. అంతా విక్రమ్‌ ప్లానే

కాంగ్రెస్‌ పార్టీ నేత ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నేత ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా విక్రమ్‌ గౌడ్‌ను పోలీసులు చేర్చారు. దీంతోపాటు ఆయనపై నాలుగు అదనపు సెక్షన్లను కూడా చేర్చినట్లు వెల్లడించారు. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ అదుపులో అనంతపురానికి చెందిన ముఠా ఉంది. పట్టుబడ్డ నిందితులను పోలీసులు బుధవారం కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. పలు అనుమానాలతో ప్రారంభమైన ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. విక్రమ్‌ గౌడ్‌ కావాలనే ఇలా చేయించినట్లు తెలిసింది.

ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన ముఠాకు విక్రమ్‌ గౌడ్‌కు గతంలోనే సంబంధాలు ఉన్నాయి. దీంతో మొత్తం ఆయన డైరెక్షన్‌లోనే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాను మూడు నెలల కిందటే కట్‌ చేయించుకున్నారట. దాంతోపాటు కాల్పుల తర్వాత పోలీసులకు ఏం చెప్పాలనే విషయంలో కూడా ఆయన తన భార్యకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం.

మొత్తానికి సానుభూతిని సంపాధించుకునేందుకు విక్రమ్‌ కాల్పుల డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చేశారు. ప్రధాన నిందితుడి నుంచి కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. రూ.50లక్షలు తమకు సుపారి ఇచ్చినట్లు విక్రమ్‌ గౌడ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం టాస్క్‌ఫోర్స్‌ సోదాల్లో ఒక పిస్టల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క, విక్రమ్‌ గౌడ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. 
Advertisement
 
Advertisement
Advertisement