రిచర్డ్‌ మూర్‌కు మరణశిక్ష అమలు | Richard Moore set for execution in South Carolina | Sakshi
Sakshi News home page

రిచర్డ్‌ మూర్‌కు మరణశిక్ష అమలు

Nov 3 2024 6:03 AM | Updated on Nov 3 2024 6:03 AM

Richard Moore set for execution in South Carolina

క్షమాభిక్ష వినతిని తోసిపుచ్చిన గవర్నర్‌ 

కొలంబియా: స్టోర్‌ క్లర్క్‌ను కాల్చి చంపిన 1999నాటి కేసులో నల్ల జాతీయుడు రిచర్డ్‌ మూర్‌(59)కు సౌత్‌ కరోలినా జైలు అధికారులు శుక్రవారం మరణ శిక్ష అమలు చేశారు. అతడికి క్షమాభిక్ష ప్రసాదించిన శిక్షను జీవిత కారాగారంగా మార్చాలంటూ కేసును విచారించిన ముగ్గురు జ్యూరర్లు, ఒక జడ్జితోపాటు పాస్టర్లు, జైలు మాజీ డైరెక్టర్, మూర్‌ కుటుంబం చేసిన వినతిని గవర్నర్‌ హెన్రీ మెక్‌మాస్టర్‌ తోసిపుచ్చారు.

 దీంతో, జైలు అధికారులు శుక్రవారం సాయంత్రం రిచర్డ్‌ మూర్‌కు విషం ఇంజెక్షన్‌ ఇచ్చి శిక్షను అమలు చేశారు. 1999 సెపె్టంబర్‌లో స్పార్టన్‌బర్గ్‌లోని ఓ రిటైల్‌ స్టోర్‌కు వెళ్లిన మూర్‌ను జేమ్స్‌ మహోనీ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. చేతికి గాయం కాగా వెంటనే స్పందించిన మూర్‌ అతడి మరో చేతిలోని తుపాకీని లాక్కుని ఛాతీపై కాల్చడంతో మహోనీ అక్కడికక్కడే చనిపోయాడు. 

కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఘటన సమయంలో మూర్‌ డ్రగ్స్‌ ప్రభావంతో ఉన్నాడని పేర్కొంటూ మరణ శిక్ష విధించింది. అయితే, మూర్‌ నేర చరితుడు కాడని, జైలులో ఉన్న సమయంలో స్రత్పవర్తనతో మెలిగినట్లు తోటి ఖైదీలు తెలిపారంటూ అతడి తరఫు లాయర్లు గవర్నర్‌ మెక్‌ మాస్టర్‌కు తెలిపారు. అటువంటి వ్యక్తి మరణశిక్ష బదులుగా క్షమాభిక్ష ప్రసాదించాలని, పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. 

ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన మూర్‌కు మరణ శిక్ష విధించడం అన్యాయమని వాదించారు. మూర్‌ కేసును విధించిన జ్యూరీలో ఆఫ్రికన్‌ అమెరికన్లు ఒక్కరూ లేని జ్యూరీలో మరణ శిక్ష పడిన ఏకైక నల్లజాతీయుడు మూర్‌ అని వారు శుక్రవారం రాసిన లేఖలో గుర్తు చేశారు. అయినా క్షమాభిక్ష ఇచ్చేందుకు మెక్‌ మాస్టర్‌ నిరాకరించారు. మూర్‌ కుమారుడు, కుమార్తె ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

తమ తండ్రి తమ జీవితాలపై ఎంతో సానుకూల ప్రభావం చూపారన్నారు. తండ్రి కోరిక మేరకే ఎయిర్‌ ఫోర్స్‌లో చేరానంటూ అలెగ్జాండ్రా మూర్‌ తెలిపింది. స్పెయిన్‌ మిలటరీ బేస్‌లోని తమ నివాసంలో ఫోన్‌ మోగినప్పుడల్లా ‘తాత ఫోన్‌ చేశాడా?’అంటూ తన ఐదేళ్ల కూతురు అడుగుతూ ఉంటుందని అలెగ్జాండ్రా అన్నారు. సౌత్‌ కరోలినాలో 50 ఏళ్ల క్రితం మరణ శిక్షను పునరుద్ధరించాక 45 మందికి ఆ శిక్షను విధించారు. ఇందులో ఒక్కరికి కూడా క్షమాభిక్ష ఇచి్చన దాఖలాలు లేవు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement