రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 22 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. దొంగ బంగారం కొన్నందుకు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.