టిప్పర్- ఆటో ఢీ: ఇద్దరి మృతి | two killed in road accident in gachibowli | Sakshi
Sakshi News home page

టిప్పర్- ఆటో ఢీ: ఇద్దరి మృతి

Aug 9 2016 9:06 AM | Updated on Aug 30 2018 4:07 PM

నగరంలోని గచ్చిబౌలిలో మంగళవారం తెల్లవారుజామున టిప్పర్, ఆటో ఢీకొన్నాయి.

హైదరాబాద్‌ : నగరంలోని గచ్చిబౌలిలో మంగళవారం తెల్లవారుజామున టిప్పర్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement