వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని మెహదీపట్నం పీవీ నర్సింహా రావు ఎక్స్ప్రెస్ వే పై చోటుచేసుకుంది.
శంషాబాద్ నుంచి నగరంలోకి వస్తున్న కారు పిల్లర్ నంబర్ 84 వద్దకు చేరుకోగానే అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.