వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం రోడ్డు దాటుతున్న బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం రోడ్డు దాటుతున్న బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం ద్విచక్రవాహానాన్ని ఢీకొనడంతో బైక్పై ఉన్న మగ్బూల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.