'హైదరాబాద్పై అధికారాన్ని వదిలేది లేదు' | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్పై అధికారాన్ని వదిలేది లేదు'

Published Sat, Aug 9 2014 10:53 AM

'హైదరాబాద్పై అధికారాన్ని వదిలేది లేదు' - Sakshi

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.  హైదరాబాద్లో గవర్నర్కు అధికారాలపై చర్చ జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కేంద్రం జోక్యంపై రాజీవ్ శర్మ ఈ భేటీలో అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్పై అధికారాన్ని  వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఈ సందర్భంగా సీఎస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం ...తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ ఆదేశాలను అమలు చేయబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
Advertisement