
ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ విందు భోజనం
ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రతిపక్ష నేతలతో కలిసి విందు భోజనం చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ కుమార్తె ఇవాళ హైదరాబాద్లో జరిగింది.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రతిపక్ష నేతలతో కలిసి విందు భోజనం చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ కుమార్తె ఇవాళ హైదరాబాద్లో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా ఈటల రాజేందర్, పలువురు మంత్రులు హాజరయ్యారు. అలాగే ప్రతిపక్ష నేతలు జానరెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్ తదితరులు విచ్చేశారు. అధికార, ప్రతిపక్ష నేతల రాకతో అక్కడ రాజకీయ సందడి నెలకొంది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో ఒకే టేబుల్పై కేసీఆర్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్ తదితరులతో కలిసి భోజనం చేశారు.