హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రతిష్ట తగ్గిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అంటే అధికారులకు అస్సలు భయం లేకుండా పోయిందని, ఆయన కొరడా ఝుళిపించాలని అన్నారు. లేదంటే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుద్దని హెచ్చరించారు. టీడీపీ ఎంపీ అయిన జేసీ తనలో ఇంకా కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తుందని అన్నారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయించుకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని జేసీ అన్నారు. అటు పార్లమెంటులో.. ఇటు అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షం సమన్వయంతో వ్యవహరించి ప్రజా సమస్యలు సభలో చర్చకు వచ్చేలా చూసుకోవాలని అన్నారు. గతంతో పోలిస్తే రాజకీయాలు స్వచ్ఛందంగా లేవని, కలుషితమయ్యాయని చెప్పారు. ప్రభుత్వాలు సహకరించకపోతే తెలివిగా వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు జనాలకు చెప్పలేకపోతున్నాయని వివరించారు. కాల్ మనీ అనేది అనాదిగా ఉందని, అధిక వడ్డీలు లేకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం కూడా చెప్పిందని, మనమే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని అన్నారు. రాయలసీమకు మూడు నామాలు తప్ప.. అభివృద్ధి లేదని అర్థమైందని చెప్పారు.
చంద్రబాబు అంటే వారికి భయం తగ్గింది: జేసీ
Published Mon, Dec 21 2015 2:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మా గుండెల్లో కొలిచేనేత ఆయన
ఎన్నికల కమిషన్.. చంద్రబాబు జేబు సంస్థా..?
ఆరోగ్యమస్తు
పోస్టల్ బ్యాలెట్ల కొనుగోలు.. ప్రభుత్వ ఉద్యోగిపై కేసు
వడ్డెరల మద్దతు వైఎస్సార్ సీపీకే
No Headline
చంద్రబాబు బూటకపు హామీలు నమ్మొద్దు
ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండండి
సంక్షేమ పథకాలు వైఎస్సార్ సీపీకే సాధ్యం
బాలినేనికి బ్రహ్మరథం
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement