దొంగతనానికి వచ్చి..ఇంటికి నిప్పు? | suspicious House Fire incident at tolichowki | Sakshi
Sakshi News home page

దొంగతనానికి వచ్చి..ఇంటికి నిప్పు?

Jan 3 2017 6:27 PM | Updated on Sep 5 2017 12:19 AM

తాళం వేసి ఉన్న ఇంట్లో మంటలు ఎగసిపడటంతో కలకలం రేగింది

హైదరాబాద్‌సిటీ: టోలిచౌకి పరిధిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో మంటలు ఎగసిపడటంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

దొంగతనానికి వచ్చిన దుండగులు చోరీ అనంతరం నిప్పుపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఇంటి యాజమాని సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement