ఫెలోషిప్ కోసం విద్యార్థుల ర్యాలీ | Sakshi
Sakshi News home page

ఫెలోషిప్ కోసం విద్యార్థుల ర్యాలీ

Published Thu, Feb 19 2015 2:25 PM

students rally for fellowship

హైదరాబాద్: ఫెలోషిప్ కింద చెల్లించే మొత్తాన్ని పెంచాలని, క్రమం తప్పకుండా ఫెలోషిప్ అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఐఐసీటీ, సీసీఎంబీల్లో పనిచేస్తున్న విద్యార్థులు ఈ మేరకు సీసీఎంబీ కాంప్లెక్స్ నుంచి తార్నాకలో హుడా కాంప్లెక్స్ వరకు గురువారం మధ్యాహ్నం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

Advertisement
Advertisement