తిరుగు ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు | special trains to secunderabad in sankranthi season | Sakshi
Sakshi News home page

తిరుగు ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు

Jan 15 2016 8:48 PM | Updated on Sep 3 2017 3:44 PM

తిరుగు ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు

తిరుగు ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులతో పాటు నగరానికి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

- ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల రాకపోకలు
- దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్:
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులతో పాటు నగరానికి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ గురువారం తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

  • కాకినాడ-సికింద్రాబాద్ (07076): 17న సాయంత్రం 4.45 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
  • విజయవాడ-సికింద్రాబాద్ (072076): శుక్రవారం(15న) రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి శనివారం ఉదయం 5.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.  
  • కాకినాడ-తిరుపతి (07431/07432): శుక్రవారం(15న) సాయంత్రం 4.45 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి శనివారం ఉదయం 7.10కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 16న సాయంత్రం 7 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
  • సికింద్రాబాద్-విజయవాడ (07208): 18న ఉదయం 6.30కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30కు విజయవాడ చేరుకుంటుంది.
  • తిరుపతి-కాకినాడ (07942): శుక్రవారం(15న) రాత్రి 10.40కి తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు కాకినాడకు చేరుకుంటుంది.
  • సికింద్రాబాద్-కాకినాడ (07011): 17న సాయంత్రం 7.15కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు 5.15కు కాకినాడ వస్తుంది.
  • కాకినాడ-సికింద్రాబాద్ (07054): 17న సాయంత్రం 5.45కు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు 4.30కు సికింద్రాబాద్ వస్తుంది.
  • సికింద్రాబాద్-తిరుపతి (02764): 18న రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
  • కాచిగూడ-గుంటూరు డబుల్ డెక్కర్ (02122/02121): 16, 18 తేదీల్లో ఉదయం 9.55కు కాచిగూడ నుంచి బయల్దేరి అదే రోజు సాయంత్రం 5.10కి విజయవాడకు, సాయంత్రం 6.15కి గుంటూరుకు చేరుకుంటుంది. రాత్రి 11 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరి రాత్రి 11.50కి విజయవాడకు, మరుసటి రోజు ఉదయం 5.25కి కాచిగూడ చేరుకుంటుంది.
  • విశాఖ-సికింద్రాబాద్(08577/08578): 17,18 తేదీల్లో సాయంత్రం 4.45కు విశాఖపట్నం నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 18,19 తేదీల్లో సాయంత్రం 5.25కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50కి విశాఖ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement