సహన కుటుంబానికి షర్మిల భరోసా | sharmila gave assurance to sahana family | Sakshi
Sakshi News home page

సహన కుటుంబానికి షర్మిల భరోసా

Jan 6 2016 11:33 AM | Updated on Sep 3 2017 3:12 PM

గ్రేటర్ హైదరాబాద్లో షర్మిల రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగుతోంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో వైఎస్ఆర్‌సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా మాణికేశ్వర్ నగర్కు చేరుకున్న ఆమె.. వైఎస్ఆర్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన బొంత సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సహన కుటుంబ సభ్యులు బుధవారం షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. నిరుపేద చిన్నారి సహన ఆరోగ్య పరిస్థితిపై 'సాక్షి' వెలువరించిన కథనాలకు పలు స్వచ్ఛంద సంస్థలు స్పందించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement