ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అదృశ్యమయ్యారు.
ఓయూ ప్రొఫెసర్ అదృశ్యం
Apr 17 2017 5:46 PM | Updated on Sep 5 2017 9:00 AM
నాగోలు: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన కనిపించకుండా పోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హస్తినాపురం తులిజ భవాని నగర్ కాలనీ లో నివసించే వి.రవి (37) ఉస్మానియా యునివర్సటీలో ప్రోఫెసర్గా పని చేస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన అప్పటినుంచి తిరిగి రాలేదు. సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement