తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు కొత్త ఐపీఎస్‌లు | new IPS officers for two telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు కొత్త ఐపీఎస్‌లు

Oct 26 2016 4:55 PM | Updated on Sep 4 2017 6:23 PM

నగరంలోని జాతీయ పోలీస్ అకాడమిలో శిక్షణ పొందుతున్న 124 మంది ఐపీఎస్‌ల శిక్షణా కాలం ముగిసింది.

హైదరాబాద్: నగరంలోని జాతీయ పోలీస్ అకాడమిలో శిక్షణ పొందుతున్న 124 మంది ఐపీఎస్‌ల శిక్షణా కాలం ముగిసింది. ఈ నెల 28 వ తేదిన జరిగే దీక్షాంత్ పరేడ్(పాసింగ్ అవుట్)కు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రానున్నట్లు అకాడమి డెరైక్టర్ అరుణ బహుగుణ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. శిక్షణ పూర్తైన ఐపీఎస్ లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఏడుగురిని కేటాయించారు. ఏపీకి కేటాయించిన నలుగురిలో ఇద్దరు ఏపీ వారే కాగా, తెలంగాణకు కేటాయించిన ముగ్గురిలో ఒకరు  తెలంగాణ చెందినవారు. 
 
ఏపీకి కేటాయించిన వారు
1, అజిత వెజెండ్ల(ఏపీ)
2, గౌతమి సాలి(ఏపీ)
3, ఆరిఫ్ హఫీజ్(కర్ణాటక)
4. బరుణ్ పురకాయస్త(అస్సాం)
 
తెలంగాణకు కేటాయించిన వారు
1, చేతన మైలమత్తుల(తెలంగాణ)
2, రక్షిత కె. మూర్తి(కర్ణాటక)
3, పాటిల్ సంగ్రామం సింగ్ గణపతి రావు(మహారాష్ట్ర)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement