ఎన్యుమరేటర్గా జీహెచ్ఎంసీ కమిషనర్ | New avatar of ghmc commissioner somesh kumar | Sakshi
Sakshi News home page

ఎన్యుమరేటర్గా జీహెచ్ఎంసీ కమిషనర్

Aug 19 2014 10:28 AM | Updated on Aug 16 2018 1:18 PM

జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఎన్యుమరేటర్ అవతారం ఎత్తారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆయన ...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఎన్యుమరేటర్ అవతారం ఎత్తారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ వివరాలను సేకరించనున్నారు. ఉదయం 11 గంటలకు తన క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేటర్కు కేసీఆర్ వివరాలు అందించనున్నారు.

 

మరోవైపు సమగ్ర సర్వేతో హైదరాబాద్ బోసిపోయింది. హోటళ్లు, దుకాణాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. సమగ్ర సర్వే కోసం నగరంలో నివసించేవారు తమ తమ స్వస్థలాలకు తరలి వెళ్లటంతో పాటు, మిగతావారు సర్వే కోసంగా ఇళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడు కిటకిటలాడే నగరమంతా నిర్మానుష్య వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement