ప్రారంభమైన జానకిరామ్ అంతిమ యాత్ర | Nandamuri janakiram last rites begin | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన జానకిరామ్ అంతిమ యాత్ర

Dec 7 2014 1:11 PM | Updated on Aug 29 2018 1:13 PM

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి జానకిరామ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. మసబ్ ట్యాంక్ లోని హరికృష్ణ...

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి జానకిరామ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. మసబ్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రక్రియ ఆరంభమైంది. జానకిరామ్ భౌతికకాయం ఉంచిన వాహనంలో అతని కుమారుడితో పాటు హరికృష్ణ, కళ్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఉన్నారు.

 

ఈ సందర్భంగా హరికృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా జానకిరామ్ అంత్యక్రియలు చేవెళ్ల మండలం మొయినాబాద్లోని ఫాంహౌస్లో నిర్వహించనున్నారు. ఈ అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement