అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నా.. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నా.. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా వెంకటాపురంలో 10 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం రికార్డయింది. ఏటూరునాగారంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.