వాళ్లకు ఓటేస్తే మోరిలో వేసినట్టే: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

వాళ్లకు ఓటేస్తే మోరిలో వేసినట్టే: కేటీఆర్

Published Sat, Jan 30 2016 1:46 AM

వాళ్లకు ఓటేస్తే మోరిలో వేసినట్టే: కేటీఆర్ - Sakshi

చందానగర్: కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఓటేస్తే మోరిలో వేసినట్లేనని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ చందానగర్ డివిజన్ అభ్యర్థి బొబ్బ నవతారెడ్డికి మద్దతుగా ఆయన శుక్రవారం రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు హైదరాబాద్‌ను అభివృద్ది చేయలేకపోయాయన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం 19 నెలల కాలంలోనే మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలను నగరానికి తీసుకొచ్చిందన్నారు. రానున్న మూడేళ్లలో హైదరాబాద్‌కు అనేక సంస్థలు వస్తాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటేస్తే వారికి ఆయుధం ఇచ్చినట్లేనని పేర్కొన్నారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,  ఎమ్మెల్యేలు సంజీవరావు, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement