తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు బృందం రేపు (సోమవారం) ఉదయం ఢిల్లీ వెళ్లనుంది.
హైదరాబాద్: తెలంగాణ భారీనీటిపారుదుల శాఖా మంత్రి హరీశ్రావు బృందం రేపు (సోమవారం) ఉదయం ఢిల్లీ వెళ్లనుంది. ఆ రోజు సాయంత్రం కేంద్రమంత్రి ఉమాభారతితో ఆయన బృందం సమావేశం కానుంది.
ఈ సమావేశంలో భాగంగా తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పనితీరుపై మంత్రి హరీశ్రావు, ఇరిగేషన్ శాఖ అధికారులు కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయనున్నారు.